ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!
Sat May 24, 2025 08:07 Politics.202505249558.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక మార్పులు చేసింది. మొబైల్ పంపిణీ రద్దు చేసి, రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయనుంది. జూన్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఈ నిర్ణయంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మార్పు పేదలకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి కీలక మార్పులు చేశారు. మొబైల్ రేషన్ పంపిణీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి.. రేషన్ డీలర్ల షాపుల ద్వారా పంపిణీకి సిద్ధమైంది. జూన్ 1 నుంచి కొత్త విధానంలో రేషన్ పంపిణీ చేస్తారు.. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లోనే పేదలకు బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందరికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు. ఒకవేళ తక్కువ తూకాలు ఇచ్చి పేదల్ని ఇబ్బందిపెడితే నిబంధనల మేరకు తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తారు.. అలాగే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కొందరు రేషన్షాపుల వారు ఏదైనా పని ఉండి ఎక్కడికైనా వెళితే ముందుగానే సమాచారం ఇచ్చి రేషన్ లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా15.50 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు డీలర్లే ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందిస్తారు.
ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
గత ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,801 కోట్లు ఖర్చు చేసింది.. 9,260 మొబైల్ వాహనాలు (ఎండీయూలు) ఏర్పాటు చేసింది. గతంలో రేషన్ దుకాణాల్లో 1 నుంచి 15వ తేదీ వరకు నిత్యావసరాలు ఇచ్చేవారు. మొబైల్ వాహనాల ద్వారా మూడు రేషన్ షాపుల పరిధిలో సరుకులు అందించేవారు. అయితే, వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాగే రేషన్ పంపిణీ 17వ తేదీ వరకు జరిగేది.. మిగిలిన రోజుల్లో వాహనాలు ఖాళీగా ఉండేవి. ఈ ఎండీయూ వాహనాల విధానంపై కేంద్రం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది అంటున్నారు. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, రేషన్ దుకాణాల ద్వారానే సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రేషన్ దుకాణాల్లో సౌకర్యాలు పెంచాలని, డీలర్ల మార్జిన్లు పెంచడం ద్వారా మంచి సేవలు అందించవచ్చని తెలిపింది. దీంతో వాహనాలను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి సిద్ధమయ్యారు.
అలాగే రేషన్ పంపిణీ వాహనాలు పొందిన ఆపరేటర్ల జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులు వాహనాలకు 10% వాటా చెల్లించారు.. మిగిలిన 90% రాయితీని ప్రభుత్వం అందించింది. ఈ మొత్తాన్ని ఆరేళ్లపాటు బ్యాంకులకు వాయిదాల పద్ధతిలో కార్పొరేషన్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ బకాయి మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి.. వాహనాలను ఆపరేటర్ల పేరు మీద ఉచితంగా బదిలీ చేయాలని కార్పొరేషన్లను ఆదేశించింది.
మరోవైపు ఎండీయూ వ్యవస్థను రద్దుచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థను కొనసాగించాలంటూ ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు తమ వాహనాలతో ధర్నా చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అధికారులకు వినతిపత్రాలిచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో 221 వాహనాల ద్వారా 72 నెలల సేవలకు ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు. తమకు ఇంకా 20 నెలల గడువు ఉండగానే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్తో...
విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?
ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
సైన్స్కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #GoodNews #APRationDelivery #HomeDelivery #APGovernment #RationScheme #PublicWelfare
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.